Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

No Changes In Senior Citizen Darshan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రణాళికలను కూడా చేస్తుంది. వేంకటేశుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు పరితపిస్తుంటారు.
 

1 /5

ఈ నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం వృద్ధుల దర్శనానికి సంబంధించిన అసత్య ప్రచారాలను నమ్మవద్దని నేడు ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ విషయంపై అనేకమార్లు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రకటన చేసింది.  

2 /5

సోషల్‌ మీడియాలో తిరుమల దర్శనానికి సంబంధించిన అసత్య వార్తలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పింది. ముఖ్యంగా వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన వార్తలను ఏమాత్రం నమ్మకూడదని చెప్పారు.  

3 /5

కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ, అవన్ని పూర్తిగా అసత్యం అని నేడు అధికారికంగా ప్రకటించింది. ప్రతినెల 23వ తేదీ వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం వెయ్యి టిక్కెట్లను మూడు నెలలు ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపింది.   

4 /5

అంతేకాదు ఇలా ఆన్‌లైన్‌ టిక్కెట్‌ దర్శనంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ. 50 ఉచిత లడ్డూను కూడా అందిస్తుందని చెప్పింది. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి నంబి ఆలయం వద్ద ఉన్న సీనియర్‌ సిటిజెన్‌/పీహెచ్‌సీ లైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి దర్శనానికి అనుమతిస్తారు.  

5 /5

ఈ సందర్భంగా వృద్ధులకు సంబంధించిన దర్శనాలపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఏదైనా సమాచారం కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ www.Tirumala.org, Https://ttdevstanams.ap.in ద్వారా మాత్రమే సంప్రదించాలని టీటీడీ యంత్రాంగం భక్తులను కోరింది.