హైదరాబాద్: బేగంపేట-సనత్నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లుకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. ఈ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా ఈ నెల 12వ తేదీన ఈ రూటులో తిరిగే పలు ఎంఎంటీసీ రైళ్లు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దైన రైళ్ల వివరాలు..
ఫలక్నుమా-లింగంపల్లి (47149)
లింగంపల్లి-ఫలక్నుమా (47173)
లింగంపల్లి-ఫలక్నుమా (47171)
హైదరాబాద్-లింగంపల్లి (47105)
ఫలక్నుమా-లింగంపల్లి (47153)
లింగంపల్లి-ఫలక్నుమా (47176)
హైదరాబాద్-లింగంపల్లి (47101)
లింగంపల్లి-హైదరాబాద్ (47128)
లింగంపల్లి-హైదరాబాద్ (47129)
ఫలక్నుమా-లింగంపల్లి (47151)
ఫలక్నుమా-లింగంపల్లి (47150)
లింగంపల్లి-ఫలక్నుమా (47174)
హైదరాబాద్-లింగంపల్లి (47100)
లింగంపల్లి-హైదరాబాద్ (47127)
ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అదికారులు కోరారు. ఈ నెల 12న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు