బ్రేకింగ్ న్యూస్: గ్రామ సచివాలయ ఫరీక్ష ఫలితాలు విడుదల 

ఏపీ గ్రామ సచివాలయ పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.

Last Updated : Sep 19, 2019, 02:15 PM IST
బ్రేకింగ్ న్యూస్: గ్రామ సచివాలయ ఫరీక్ష ఫలితాలు విడుదల 

అభ్యర్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు. సుమారు  1.26 లక్షల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ ఈ నెల 1 నుంచి 8 వరకూ  పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. 

గాంధీజయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్దులకు ఈ గ్యాప్ లో అంటే  ఈ నెల 30 నుంచి వచ్చే నెల 1న వరకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉంటే ఫలితాలను  ఏపీ ప్రభుత్వానికి  సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచారు. gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్  లోకి  వెళ్లి ఫలితాలను తెలుసుకోచ్చని అధికారులు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పరీక్ష ఫలితాలను తెలుసుకోండి మరి.. ఆల్ ది బెస్ట్

Trending News