జగన్ తో కేటీఆర్ భేటీ : ఫెడరల్ ఫ్రంట్, రిటర్న్ గిఫ్ట్ పై చర్చ

తెలుగు రాష్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి

Last Updated : Jan 16, 2019, 01:04 PM IST
జగన్ తో కేటీఆర్ భేటీ : ఫెడరల్ ఫ్రంట్, రిటర్న్ గిఫ్ట్ పై చర్చ

వైసీపీ చీఫ్ జగన్ తో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. లోటస్ పాండ్ వేదికగా జరగుతున్న ఈ భేటీలో టీఆర్ఎస్, వైసీపీ  ముఖ్యనేతలు కూడా ఉన్నారు.  కాగా ఈ భేటీలో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ  జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై  జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే దానిపై సర్వత్వా ఉత్కంఠత నెలకొంది.

బీజేపీతో వైసీపీ  కుమ్మకైందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలో ఫెడరల్ దారి పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలతో భేటీ నిర్వహిస్తుండటం గమనార్హం. చంద్రబాబు విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఈ భేటీ అనంతరం జగన్, కేటీఆర్ లు జాయింట్ మీడియా సమావేశం నిర్వహించననున్నట్లు తెలిసింది. ఈ ప్రెస్ మీట్ లో జగన్ ఫెడలర్ ఫ్రంట్ పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చనడుస్తోంది. 

ఈ భేటీ సందర్భంలో ఏపీలో రాజకీయాలపై చర్చ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్న కేసీఆర్..ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావ చూపుతారో ఈ భేటీ ద్వార తేలిపోనుంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x