తండ్రి అంతిమ సంస్కారాల కోసం హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల

తండ్రి అంతిమ సంస్కారాల కోసం హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల

Last Updated : Sep 15, 2019, 11:05 AM IST
తండ్రి అంతిమ సంస్కారాల కోసం హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల

హైదరాబాద్: తన తండ్రి బిఎన్ యుగంధర్ మరణ వార్త తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌ (82) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

సెప్టెంబర్ 13న బిఎన్ యుగంధర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, యుగంధర్ కుమారుడు సత్య నాదెళ్ల ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండటంతో ఆయన వచ్చే వరకు యుగంధర్ భౌతికకాయాన్ని నల్లగండ్లలోని సిటిజన్‌ ఆస్పత్రిలో ఉంచారు.

Trending News