CM Charanjit Singh Channi: పంజాబ్ ప్రజలకు దీపావళి కానుక..విద్యుత్​ ఛార్జీ యూనిట్​కు రూ.3 తగ్గింపు!

Chandigarh: దీపావళి సందర్భంగా.. పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను యూనిట్​కు మూడు రూపాయల మేర తగ్గించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 08:09 PM IST
CM Charanjit Singh Channi: పంజాబ్ ప్రజలకు దీపావళి కానుక..విద్యుత్​ ఛార్జీ యూనిట్​కు రూ.3 తగ్గింపు!

Chandigarh: పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఛార్జీ(power tariff)లను యూనిట్​కు మూడు రూపాయలు తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన విద్యుత్ ఛార్జీలు(electricity rates) సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు. 

ఒక్కో యూనిట్​ ధరను రూ.3 తగ్గించినట్లు సీఎం(Punjab Chief Minister Charanjit Singh Channi) పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి తక్కువ విద్యుత్​ ఛార్జీలు ఉన్న రాష్ట్రంగా పంజాబ్(Punjab)​ నిలిచిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ.3,316కోట్ల భారం పడనుంది.

Also Read: Akhilesh Yadav: వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను..అఖిలేష్‌ యాదవ్‌ సంచలన ప్రకటన

డీఏ పెంపు..
విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో పాటు.. రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది పంజాబ్ సర్కార్​. కరవు భత్యం(డీఏ)ను 11శాతం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News