పోలింగ్ కేంద్రానికి సమీపంలో బాంబు పేలుడు

పోలింగ్ కేంద్రానికి సమీపంలో బాంబు పేలుడు

Last Updated : Apr 11, 2019, 04:25 PM IST
పోలింగ్ కేంద్రానికి సమీపంలో బాంబు పేలుడు

గడ్చిరోలి: మావోయిస్టులు మరోసారి పంజా విసిరేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రానికి సమీపంలో మావోయిస్టులు ఐఇడి బాంబు పేల్చారు. అయితే, అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలుస్తోంది.ఇదే గడ్చిరోలి జిల్లాలో నేడు జరగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు చేపట్టేందుకు వెళ్తున్న ఓ పోలింగ్ పార్టీకి భద్రత కల్పిస్తూ వెళ్లిన సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఇడి బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. 

అయితే, ఈ ఘటనలోనూ ఒక జవాన్‌కి గాయం కాగా అదృష్టవశాత్తుగా మిగతా జవాన్లు దాడి నుంచి బయటపడగలిగారు. ఇక నేటి ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News