NEET 2019: నేటి నుంచే నీట్ 2019 రిజిస్ట్రేషన్‌

NEET 2019: నేటి నుంచే నీట్ 2019 రిజిస్ట్రేషన్‌

Last Updated : Nov 1, 2018, 06:05 PM IST
NEET 2019: నేటి నుంచే నీట్ 2019 రిజిస్ట్రేషన్‌

నేషనల్ ఎలిజిబులిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 పరీక్షకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తెలిపింది. గతంలో సీబీఎస్ఈ నిర్వహించిన ఈ ఎంట్రన్స్ టెస్టును ఈ ఏడాది ఎన్టీఏ నిర్వహించనుంది. ఎంబీబీఎస్/బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రాసే ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం తమ పేరు నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in లోకి లాగిన్ అయి తమ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 2018లో 13 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా ఈ ఏడాది కూడా ఇంచుమించు అదే సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది లాగే పెన్ను, పేపర్‌ పద్దతిలోనే పరీక్ష నిర్వహణ ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. 

ముఖ్యమైన తేదీలు:
నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు నీట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ 15, 2019 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 6న రాత పరీక్ష నిర్వహణ

నీట్ 2019 రిజిస్ట్రేషన్‌కి అవసరమైన డాక్యుమెంట్స్:
10వ తరగతి మార్క్స్ మెమొ
12వ తరగతి మార్క్స్ మెమొ
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ 
స్కాన్ చేసిన సంతకం
ఆధార్ లేక ఓటర్ వంటి వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x