Sobhita Dhulipala: నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతా.. మరోసారి బాంబు పేల్చిన శోభితా ధూళిపాళ..

Sobhita on Ponniyin Selvan: శోభితా మరోసారి ఇన్ స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో తన పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. దీంతో శోభితా ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.
 

1 /7

శోభితా దూళిపాళ తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నినెలల క్రితం అక్కినేని నాగ చైతన్యకు, శోభితా ధూళి పాళకు ఎంగెజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున తన ఇన్ స్టా వేదికగా వీరి ఎంగెజ్ మెంట్ పిక్స్ లను సైతం షేర్ చేశారు. అంతేకాకుండా.. బెస్ట్ విషేక్ కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న కొన్నిరోజులుగా వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.

2 /7

మరోవైపు అక్కినేని నాగ చైతన్య, శోభితాల ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి తరచుగా శోభితా ఏదో రకంగా వార్తలలో ఉంటున్నారు. వీరి ఎంగెజ్ మెంట్ కాగానే.. వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. అప్పట్లో వీరిద్దరి కూడా డైవర్స్ అవ్వడంపక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

3 /7

నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినప్పుడు కూడా కొంత మంది  శోభితాపై సెటైర్ లు సైతం వేశారు. ఈ నేపథ్యంలో.. ఆమె తన సారీస్ , హెయిర్ స్టైల్ ల కలెకన్ ల పరంగా తరచుగా వార్తలలో ఉంటున్నారు.  ఈ నేపథ్యంతో ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా పెళ్లి, పిల్లలపై కామెంట్లు చేశారు. 

4 /7

తన లైఫ్ లో ఎంగెజ్ మెంట్ , పెళ్లి, పిల్లల గురించి ఇలానే ఉండాలని ప్లాన్ చేసుకొలేదని సరదాగా మాట్లాడారు. అదే విధంగా తన ఎంగెజ్ మెంట్ గ్రాండ్ గా, సంప్రదాయ బద్దంగా జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది దీన్ని కూడా మిస్ లీడ్ చేసేలా.. శొభితాకు అసలు పెళ్లే ఇష్టంలేదు, పిల్లల గురించి కూడా అంత పాజీటివ్ గా లేదన్నట్లు  రూమర్స్ సైతం క్రియేట్ చేశారు.

5 /7

అంతేకాకుండా.. తాజాగా శొబితా బేబీ బంప్ తో కన్పించారు. దీన్ని కూడా కొందరు ట్రోలీంగ్ చేశారు. అయితే..శొభితా నటించినన లవ్ సితార మూవీ.. ఓటీటీలో.. లవ్ సితార జీ5 స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చింది. అందులో శోభితా బేబీ బంప్ తో కన్పించింది.  ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ ఫోటోలు షేర్ చేసినట్టు తెలుస్తోంది.   

6 /7

తమిళంలో.. పొన్నియన్ సెల్వన్ సినిమా వచ్చి రెండెళ్లు పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ టీమ్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆఫోటోకు క్యాప్షన్ ను జతచేసి.. పొన్నియన్ సెల్వన్ లో.. విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్,శోభితా దూలిపాళ నటించారు.  

7 /7

ఈ టీమ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసి, వీరంతా ఎవెంజర్స్ అని క్యాప్షన్ ఇచ్చాచు. అంతేకాకుండా.. నా పిల్లలకు వీళ్ల గురించి చెబుతానంటూ కూడా క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. పొన్నియన్ సెల్వన్ కల్కి కృష్ణమూర్తి రచించిన ఈ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు.