Priyamani: పెళ్లయిన వదలట్లేదు.. నరకం చూపిస్తున్నారంటూ ప్రియమణి ఎమోషనల్..!

Priyamani divorce: హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలో నటించింది ఈ హీరోయిన్. ఈమధ్య ఓటీటీలో కూడా ఎన్నో చిత్రాల్లో కనిపిస్తూ మంచి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

1 /6

2003లో ఎవడే అతగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 

2 /6

ఈ సినిమా అందించిన క్రేజ్ తో జూనియర్ ఎన్టీఆర్,  నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, గోలీమార్ చిత్రాలు చేసి మరింత సక్సెస్ అందుకుంది. 

3 /6

వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె,  తన వైవాహిక బంధం పై వస్తున్న రూమర్స్ కు స్పందించింది. ముస్తఫా రాజ్ తనకు చాలా కాలం నుంచే తెలుసు అని. మా ఇష్టా ఇష్టాలు కలవడం వల్లే పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాము అని , 2016లో మా నిశ్చితార్థం జరిగినప్పుడు చాలామంది మాపై విమర్శలు గుప్పించారు అంటూ తెలిపింది 

4 /6

వేరే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను వివాహం చేసుకుంటున్నానని చాలామంది రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తూ నరకం చూపించారు. ఇప్పటికీ కూడా ఆ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. 

5 /6

అయితే కొన్ని కొన్ని సార్లు వాటిని కొట్టి పారేస్తాను. కానీ ఎప్పుడైనా అవి మనసుకు తగిలినప్పుడు.. చాలా బాధగా అనిపిస్తుంది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. 

6 /6

కులమతాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ట్స్ చాలామంది ఉన్నారు. కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో.. అర్థం కావడం లేదు అంటూ ప్రియమణి ఎమోషనల్ అయింది.