Mrunal Thakur: జాన్వి కపూర్వ వల్ల మృణాల్ ఠాకూర్ కి ఘోర అవమానం..మృణాల్ ఏమనిందంటే..!

Mrunal Thakur Interview: మృణాల్ ఠాకూర్ నెపోటిజం గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక ప్రముఖ స్టార్ కిడ్ తో కలిసి అవార్డు గెలిచినప్పుడు మీడియా తన పట్ల చూపించిన ప్రవర్తన గురించి మృణాల్ కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టింది. అవార్డు వేడుకలో మీడియా ఆమెను ఘోరంగా అవమానించిన సంగతి బయటపెట్టింది మృణాల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
 

1 /5

స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల బాలీవుడ్‌లో నెపోటిజం గురించి తన అనుభవాలను పంచుకుంది. మీడియా స్టార్ కిడ్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ ఒక అవార్డు ఫంక్షన్ లో తనకి జరిగిన ఘోర అవమానం గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ భామ.   

2 /5

2019లో జరిగిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు రాత్రి జరిగినప్పుడు, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఇద్దరూ వేరే విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నారు. మృణాల్ 'బెస్ట్ క్రిటిక్స్ యాక్ట్రెస్' అవార్డును గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మృణాల్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కొందరు మీడియా సభ్యులు. 

3 /5

"నేను ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నాను. మధ్యలో ఎవరో స్టార్ కిడ్ రాగానే.. అందరూ మధ్యలో వదిలేసి ఆమె వెంట వెళ్ళిపోయారు. నాకు బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. జాన్వీ కపూర్ కి కూడా అలాగే అవార్డు వచ్చింది" అంటూ తన చెడు అనుభవాన్ని అందరితో పంచుకుంది మృణాల్ ఠాకూర్.

4 /5

అయితే నెపోటిజం గురించి మాట్లాడుతూ, "ఇది వారి తప్పు కాదు. వారు స్టార్ కిడ్స్, కానీ మనం, సాధారణ ప్రజలుగా, వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తాం. ఇది ప్రేక్షకులు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది" అని అంటోంది మృణాల్. 

5 /5

తెలుగులో ఆమె నటించిన సీతా రామం, హాయ్ నాన్న చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఫ్యామిలీ స్టార్' మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. కల్కి 2894 లో కూడా చిన్న పాత్రలో కనిపించిన మృణాల్ మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది.