నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణంగా  హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న మృతదేహాన్ని స్టేషన్ మాస్టర్ గుర్తించి..  పోలీసులకు సమాచారం అందించాడు.

Last Updated : Feb 10, 2020, 04:09 PM IST
నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణంగా  హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న మృతదేహాన్ని స్టేషన్ మాస్టర్ గుర్తించి..  పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు  శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

 కొంత మంది గుర్తు తెలియని దుండగులు..  బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే ఆ వ్యక్తి ఎవరు ..? అతన్ని ఎవరు హత్య చేశారు..? హత్యకు కారణాలేంటి.. ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. 

Trending News