Jayasudha: 64 సంవత్సరాల వయసులో మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జయసుధ.. ఏమనిందంటే..?

Jayasudha third marriage : పండంటి కాపురం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు నాచురల్ బ్యూటీ జయసుధ. ప్రస్తుతం ఆమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

1 /6

ఎన్టీఆర్,  ఏఎన్ఆర్, చిరంజీవి , బాలకృష్ణ, శోభన్ బాబు,  కృష్ణ ఇలా ఎంతోమంది హీరోల సరసన.. నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నటి జయసుధ.  

2 /6

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది జయసుధ. ఇటీవల సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎన్నో విషయాలను పంచుకున్నారు.

3 /6

అందులో భాగంగానే 64 సంవత్సరాల వయసులో మూడో పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసింది. జయసుధ వ్యాపారవేత్త కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ ను  తొలుత వివాహం చేసుకుంది. కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.   

4 /6

ఆ తర్వాత 1985లో బాలీవుడ్ నటుడు జితేంద్ర బంధువు నితిన్ కపూర్ ను  వివాహం చేసుకుంది. ఈయన ఫిలిం పంజాబీ ప్రొడ్యూసర్. నిహార్ , శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే 2017 లో నితిన్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నారు. 

5 /6

ఇక ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆమె విదేశీ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  

6 /6

ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయాలపై ప్రశ్నించగా.. నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా రాసేవారు రాస్తారు. మంచి పక్కన పెట్టి నెగిటివ్గా రాసేవారు ఎక్కడ ఉన్నా సరే మాలాంటి వారికి ఇలాంటి ఇబ్బందులు తప్పవు అంటూ మూడో పెళ్లిపై పరోక్షంగా కామెంట్లు చేసింది జయసుధ.