Anasuya: రక్తం మడుగుల్లో అనసూయ.. చూస్తే తట్టుకోలేం..!

Anasuya: అనసూయ ముఖం మొత్తం గాయాలు అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా,  తాను నటించిన సింబా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షేర్ చేసినట్టు సమాచారం. 

1 /5

గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ జబర్దస్త్ వేదికపై తన అంద చందాలతో అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జబర్దస్త్ షో లో యాంకర్ గా పనిచేసి భారీ క్రేజ్ దక్కించుకున్న అనసూయ,  ఒకవైపు సినిమాలలో కూడా నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజిలో గుర్తింపు సొంతం చేసుకుంది. 

2 /5

ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్,  సమంత జంటగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ పోషించి, ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయ అదే జోరులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 

3 /5

అవకాశం దొరికితే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ. సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ఈమె తాజాగా రక్తం మడుగుల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. 

4 /5

ముఖం నిండా రక్తం కారుతున్న ఒక ఫోటో అలాగే ఎవరో బాగా కొడితే ముఖం కందిపోయినట్టు ఉండే ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు అనసూయకు ఏమైంది? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

5 /5

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇదంతా ప్రమోషన్ కోసం అన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె నటించిన చిత్రం సింబా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇలా ఫోటోల రూపంలో పంచుకుంది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.  ఎప్పుడు అందంగా , గ్లామర్ బ్యూటీగా కనిపించే అనసూయ  ఇలా ఒక్కసారిగా ముఖం నిండా గాయాలతో  కనిపించేసరికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.