Bharat Bandh: రైతుల దేశవ్యాప్త బంద్‌కు కేసీఆర్ మద్దతు

Bharat Bandh:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

  • Dec 06, 2020, 12:02 PM IST

Bharat Bandh: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల సమ్మె నడుస్తోంది.

1 /8

డిసెంబర్ 8న జరగబోయే భారత్ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు  కాంగ్రెస్ సహా..ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్ పీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, డీఎంకే పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

2 /8

దాదాపు 4 గంటల సేపు చర్చలు జరిగినా...ఎటువంటి ఫలితం రాలేదు. ఈ ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టారు. కేంద్రం మాత్రం కొంత సమయం కోరింది. తుది నిర్ణయం గానీ, నిర్దిష్ట ప్రతిపాదన కోసమైనా ఈ నెల 9 వరకూ గడువు కోరింది.

3 /8

రైతుల పోరాటం న్యాయబద్ధమైందని..డిమాండ్స్ ఆమోదయోగ్యమని కేసీఆర్ తెలిపారు. రైతుల వెంట నిలవాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు.

4 /8

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రమంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. 

5 /8

భారత్ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

6 /8

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతుల సమ్మెకు మద్దతు తెలిపిన కేసీఆర్..ఇప్పుడు బారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

7 /8

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

8 /8

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల సమ్మె నడుస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న అఖిల భారత రైతు సంఘాలు భారత్ బంద్  తలపెట్టాయి.