Good News: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి గుడ్‌ న్యూస్‌.. కొత్త నిర్ణయంతో బంగారు ధరలు అమాంతం డౌన్‌!

Gold Purchase: త్వరలోనే భారత ప్రభుత్వం “One Nation, One Gold Rate” అనే సంస్కరణను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధాన సంస్కరణకు సంబంధించిన అన్ని విషయాలను కేంద్రం పరిశీలించింది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో భారత్‌లోని బంగారు ధర వ్యత్యాసాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గోల్డ్‌ విక్రయాలు కూడా దీని ద్వారా సులభతరమయ్యే ఛాన్స్‌ ఉంది. 
 

1 /7

భారత్‌లో బంగారు విక్రయాలు డిమాండ్, పన్నుల కారణంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ధరలు ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే.. బంగారు ధరలు చెన్నై, ముంబై ఒక ధర ఉంటే.. హైదారబాద్‌, కోల్‌కతాల్లో మాత్రం మరో విధంగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతీయ వైవిధ్యాలే వినియోగదారులను చాలా వరకు ప్రభావింతం చేస్తాయి.   

2 /7

ఒక దేశం, ఒకే గోల్డ్ ప్రధానం లక్ష్యం.. దేశంలో ప్రతి నగరంలో బంగారం ఒకే ధరకు లభిస్తుంది. అంతేకాకుండా దేశంలో ఏ నగరానికి వెళ్లిన ఒకే ధరకు బంగారం కొనుగోలు చేయోచ్చు. అదే ధరకు విక్రయించే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.   

3 /7

ఒక దేశం, ఒకే గోల్డ్ ద్వారా బంగారు కొనుగోలు చేసేవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా ధరలను సరిపోల్చడానికి, గోల్డ్ గురించి సమాచారం తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  

4 /7

ఇప్పటికే ఈ ప్రతిపాదనకు భారతదేశంలో అన్ని ప్రధాన ఆభరణాల  కంపెనీ, స్వర్ణకారుల మద్దుతు కూడా లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది.   

5 /7

ఒక దేశం, ఒకే గోల్డ్ సంస్కరణకు సంబంధించిన అధికారక ప్రకటన 2025 సెప్టెంబర్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన కీలక సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జరపాలని కూడా భావిస్తోందట.   

6 /7

అంతేకాకుండా ఈ సంస్కరణను అమలు చేసే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కేంద్ర పరిష్కరించేందుకు సిద్ధంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాజిస్టికల్ పరంగా వచ్చే ఎలాంటి సమస్యలైనా కేంద్రం సులభంగా పరిష్కారించనుంది. 

7 /7

“ఒక దేశం, ఒకే బంగారం ధర” సంస్కరణ భారత్‌ అమలవుతే.. బంగారు ధరలు కూడా స్థిరంగా మారుతాయి. అంతేకాకుండా భారత్‌ వ్యాప్తంగా గోల్డ్‌ ధరలు కూడా తగ్గే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే ఇది బంగారు మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.