EPS: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఇక పింఛను ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు..

EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్‌ స్కీమ్‌ (EPS)‌ 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) మాత్రమే నిర్వహించేంది. ఇక త్వరలో ఏ బ్యాంకుల్లో అయినా పింఛను తీసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఇప్పటి వరకు పింఛను కేవలం ఈపీఎఫ్‌ఓ మాత్రమే నిర్వహించేది ఇకపై పింఛను దారులు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ డబ్బులను తీసుకోవచ్చు. ఇది 2025 జనవరిలో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కార్మికశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవ్యా తెలిపారు. ఈయన ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీగా కూడా ఉన్నారు.  

2 /5

సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టం (CPPS) దీని ద్వారా పెన్షన్‌ పేమెంట్స ఆర్డర్ ట్రాన్స్‌ఫర్ అవసరం ఉండదు. లొకేషన్‌, బ్యాంకులు మారినప్పుడు ట్రాన్స్‌ఫర్ పెన్షన్‌ ఆర్డర్‌ అవసరం లేకుండానే 7.8 మిలియన్ల పింఛనుదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.  

3 /5

ఈ విధానం ద్వారా పింఛనుదారులు తమ ఏ బ్యాంకు, బ్రాంచీ ద్వారానైనా పెన్షన్‌ పేమెంట్స ఆర్డర్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేకుండానే సులభంగా పింఛను పొందవచ్చు. ఈ విధానం దీర్ఘకాలికంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని మాండవ్య తెలిపారు ఇది ఈపీఎఫ్ఓ ఐటీ మోడ్రనైజేషన్‌లో భాగంగా తీసుకువచ్చిన సిస్టం అన్నారు.  

4 /5

ఈ కొత్త విధానం వల్ల పింఛనుదారులకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పనిలేదు. వెరిఫికేషన్‌ ప్రక్రియ కూడా ఉండదు. పెన్షన్‌ విడుదలైన వెంటనే మీ ఖాతాలో క్రెడిట్‌ అయిపోతాయి. ఈ విధానం వల్ల పింఛను పంపిణీలో ఖర్చు కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.  

5 /5

 ప్రస్తుతం కేవలం 4 బ్యాంకులతో మాత్రమే ఈపీఎఫ్ఓ ఒప్పందం కలిగి ఉంది. రానున్న కాలంలో ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ పద్ధతిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.