Sobhita Dhulipala: హైడ్రా టెన్షన్ లో నాగార్జున.. గోకులంలో చిల్ అవుతున్న శోభితా ధూళిపాళ

sobhita celebrate Janmashtami 2024: అక్కినేని వారి కాబోయే కోడలు శోభిత ధూళిపాల తాజాగా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.  మధురలోని బృందావనంలో జరిగిన వేడుకల్లో శోభిత సందడి చేశారు.  ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హైడ్రా టెన్షన్ లో నాగార్జున తల పట్టుకుంటే..శోభిత గోకులంలో చిల్ అవుతందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

1 /7

అసలే పెళ్లి ఫిక్స్ అయింది అనే ఆనందం ఏమో కానీ.. శోభిత తన్మయత్వంతో బృందావనంలో గోపికల డాన్స్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

2 /7

ఇదంతా బాగానే ఉంది కానీ మామగారు కష్టపడి కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తునా తునకలు అయిపోయిన సందర్భంలో శోభిత చేస్తున్న డ్యాన్సులకి ఏమాత్రం సింక్ అవడం లేదని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. 

3 /7

అయితే ఓవైపు అత్తింటి వారు కష్టాల్లో ఉన్న సమయంలో ఎంజాయ్ చేస్తూ పిక్స్ విడుదల చేయడం ఏమాత్రం సబబుగా లేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

4 /7

మరోవైపు శోభిత అభిమానులు కూడా అలాగే స్పందిస్తున్నారు. ఆమెకు శ్రీకృష్ణుడి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయని అందుకే ఆమె కృష్ణాష్టమి సందర్భంగా మధురకు వెళ్లి అక్కడ తన్మయత్వంతో నాట్యం చేస్తున్నట్లు చెప్తున్నారు. 

5 /7

ఇదిలా ఉంటే ఇటీవలే నాగచైతన్య శోభిత ధూళిపాల మధ్య నిశ్చితార్థం జరిగింది.  అతి కొద్ది మంది సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఒకటవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు . త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు

6 /7

మరోవైపు రెండేళ్ల క్రితం నాగచైతన్య సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి జంట అటు  రీల్ జీవితంలోను రియల్ జీవితంలోనూ మీద రొమాన్స్ పండించినప్పటికీ చివరకు విడాకులతో వీరి బంధం ముగిసిపోయింది. 

7 /7

అటు అక్కినేని అభిమానులు మాత్రం నాగచైతన్యకు మరో వివాహం కుదరడంతో ఉత్సాహంతో ఊగిపోతున్నారు. తమ హీరోకు సరైన జోడి శోభిత ధూళిపాల అని ఆమెను ఆకాశానికి ఎత్తివేస్తున్నారు.