RBI New Rules: మీ ఈఎంఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు, ఇవాళ్టి నుంచి ఇలా చేయాల్సిందే

RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
 

RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.

ఇప్పటి వరకూ మనం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా హోం‌లోన్స్ లేదా ఇతర ఏ చెల్లింపులైనా సరే ఈసీఎస్ ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేస్తూ వచ్చాం. ఇకపై అలా లేదు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ అవసరమవుతుంది. కొత్త నిబంధనలేంటి, ఎలా అమలవుతాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
 

1 /5

అక్టోబర్ 1, 2021 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలవుతుంది. చెల్లింపులకు 24 గంటల ముందు బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేయాలి. అలర్ట్ మెస్సేజ్ లేదా ఈ మెయిల్ రూపంలో ఉండవచ్చు. 

2 /5

ఇక నుంచి హోంలోన్స్ ఈఎంఐ, ఇతర చెల్లింపులకు మ్యాన్యువల్‌గా అప్రూవ్ చేయాల్సిందే. ఈ తరహా చెల్లింపులకు యూజర్ల నుంచి ఏ విధమైన అదనపు ఛార్జీల్ని వసూలు చేయరని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆర్బీఐ చెబుతోంది. వివిధ బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు అలర్ట్ మెస్సేజ్‌లు, మెయిల్స్ పంపించాయి. 

3 /5

ఓటీపీ ధృవీకరణ ద్వారానే చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల్లో భద్రత కోసమే కొత్త విధానం ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ , ఫోన్ రీఛార్జ్ , బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, యుటిలిటీ బిల్స్ అన్నీ కొత్త నిబంధనల పరిధిలో రానున్నాయి. ఐదు వేలలోపు పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. 

4 /5

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా 5 వేలకు మించిన చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సిందే. ఆర్బీఐ చెల్లింపుదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులకు ఇక నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్ అంటే ఏఎఫ్ఏ అవసరం. 

5 /5

5 వేల కంటే ఎక్కువ చెల్లింపులకు యూజర్ నుంచి ఓటీపీ తప్పనిసరి. అన్నిరకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు కొత్త నిబంధనల వర్తింపుమ్యూచువల్ ఫండ్ సిప్స్ వంటి చెల్లింపులకు వర్తించదు.