Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు. అయితే వృద్ధుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం వృద్ధుల కోసం ప్రత్యేక ఆచార్యులు తీసుకుంటుంది వారికి సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తోంది. వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పిస్తున్న టీటీడీ వారికి ఉచిత  దర్శనంతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తోంది.  

2 /5

ప్రతిరోజు రెండు ఫ్లాట్లో వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. వయస్సు రీత్యా పెద్దవారికి శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పాటు ఎదురు చూడాల్సిన పనిలేదు. వారికి ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా సకలం సమకూరుస్తున్నారు టీటీడీ యంత్రాంగం. అంతేకాదు దర్శనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కూడా వృద్ధులకు సాంబార్ అన్నం, వేడిపాలు వారికి అందించనున్నారు.  

3 /5

దర్శనం తర్వాత కూడా వీరికి బ్యాటరీ కారులో డ్రాప్ చేయనున్నారు. కేవలం అరగంటలోనే వృద్ధులకు దర్శనం కల్పిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు పొందాలంటే 0877227777 సంప్రదించవచ్చు.  

4 /5

ఇదిలా ఉండగా నేటి నుంచి టీటీడీ కల్యాణోత్సవం ఆర్జిత తిరుమంజాసన సేవ టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు 24వ తేదీన విక్రయించనున్నారు. అదేరోజు గదులకోట కూడా మధ్యాహ్న 3:00 నుంచి విక్రయిస్తారు.   

5 /5

అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ భక్తుల కోసం టీటీడీ ఇలా ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను అందుబాటులో పెడుతుంది. ముందుగా బుక్‌ చేసుకున్నవారికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతోంది. ఇటీవల 2025 ఫిబ్రవరి కోటాకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేసింది టీటీడీ.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x