School Holidays: ఫిబ్రవరి 5 వరకు స్కూళ్లకు సెలవులు.. ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే..

School Holidays Till February 5th: స్కూళ్లకు వరుసగా సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వరుసగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నిర్వహించనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

మరోసారి విద్యార్థులకు తీపికబురు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5 వరకు వరుసగా సెలవులు ప్రకటించారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ సెలవులు వర్తిస్తాయి. వారికి కేవలం ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నిర్వహించాలని విద్యాశాఖ తెలిపింది.  

2 /5

మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భంగా 1.74 కోట్ల మంది దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కాశీలోని అన్నీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నిర్వహించనున్నారు.  

3 /5

వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు 2025 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కేవలం ఈ క్లాసులకు ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నిర్వహిస్తారు. యూపీ బోర్డు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అన్నీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  

4 /5

వారణాసి మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. వీఐపీ ప్రోటోకల్‌ గోదౌల్య నుంచి మడగిన్‌ మహాకుంభమేళా మధ్యలో భారీ ట్రాఫిక్‌ నేపథ్యంలో ఈ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ మార్గంలో పోలీస్‌ కమిషనర్‌, 7 ఏడీసీపీ,10 ఏసీపీ, 8 మంది ఐపీఎస్‌లతోపాటు 500 మంది సెంట్రల్‌ సెక్యూరిటీ ఫోర్సులతో గస్తీ నిర్వహిస్తున్నారు.  

5 /5

ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం కుంభమేళాలో ఘోరం చోటు చేసుకుంది. తొక్కిసలాట ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రధాని మోదీ, యోగీ ఆధిత్య నాథ్‌ ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x