Godavari Heroine: గోదావరి మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో తెలుసా.?

Godavari Second Heroine: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా,  కమలిని ముఖర్జీ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం గోదావరి. ఈ సినిమాలో సుమంత్ మరదలిగా సెకండ్ హీరోయిన్ గా నటించిన నీతూ చంద్ర ,2021 లోనే ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం వ్యాపారాలు చేస్తూ బిజీగా మారిపోయింది..

1 /5

గోదావరి.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా ఆ గోదావరి, ఆ హడావిడి నటీనటుల అద్భుతమైన ప్రదర్శన అన్నీ కూడా కళ్ళ ముందు తారసపడతాయి. ఈ చిత్రం ఎంత గొప్పగా ప్రేక్షకులను ఆకట్టుకుందంటే ఇందులో నటించిన నటీనటులు కూడా మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి వారిలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన నీతూ చంద్ర కూడా ఒకరు.   

2 /5

మొదటి సినిమాతోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా ద్వారానే బాగా పేరు సంపాదించుకుంది. ఈమె పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు కానీ గోదావరి సినిమాలో సుమంత్ మరదలు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన అందం,  నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది నీతూ చంద్ర.  

3 /5

2006లో మే 19వ తేదీన డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఇందులో హీరోగా సుమంత్,  హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించారు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

4 /5

ఇందులో సుమంత్ మరదలుగా రాజీ పాత్రలో కనిపించింది హీరోయిన్ నీతూ చంద్ర. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా , అమాయకమైన మరదలుగా కనిపించి తెలుగు ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె పెద్దగా కనిపించలేదు. దీంతో అభిమానులు ఏమైపోయింది? ఎక్కడుంది? అని ఆరా తీస్తున్నారు. 1984 జూన్ 20న  ఈమె బీహార్ లోని పాట్నా లో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నీతూ,  ఆ తర్వాత 2003లో విష్ణువు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2005లో వచ్చిన గరం మసాలా సినిమాలో నటించిన ఈమె , ఆ తర్వాత గోదావరి సినిమాలో నటించి పాపులర్ అయింది. 2021లో చివరిసారి హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో నటించింది  

5 /5

2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు కమ్యూనిటీ అంబాసిడర్ గా.. మారిన ఈమె ప్రస్తుతం వ్యాపారి రంగంలో బిజీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను,  వీడియోలను షేర్ చేస్తోంది.