Unified Pension Scheme: యూపీఎస్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు.. వారికి 19 శాతం పెంపు..!

UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్‌ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
 

1 /10

ఎన్‌పీఎస్ విధానం చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.  

2 /10

యూపీఎస్‌లో చేరితే లాభం ఉంటుందా అని చాలామంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ సహకారం 14 శాతం ఉండగా.. యూపీఎస్‌లో 18.5 శాతానికి పెరుగుతుందని UTI పెన్షన్ ఫండ్ అధ్యయనంలో తేలింది.  

3 /10

యూటీఐ గణన ప్రకారం.. నెలవారీ జీతం రూ.50వేలపై చేరిన వారికి దాదాపు 19 శాతం పెరుగుదల ఉంటుంది.  ఉద్యోగుల వార్షిక వేతనం 3 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. అంటే ఇది 8 శాతం CAGR లేదా కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని తెలిపింది.  

4 /10

యూపీఎస్‌లో ఓ ఉద్యోగి తన రిటైర్‌మెంట్‌కు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పెన్షన్‌గా అందుకుంటారు.  

5 /10

ఒకవేళ ఉద్యోగి మరణిస్తే.. వారి భాగస్వాములకు పింఛన్ చెల్లిస్తారు. ఆ ఉద్యోగి చనిపోయే నాటికి అందుకుంటున్న జీతంలో 60 శాతాన్న పెన్షన్‌గా అందిస్తారు.  

6 /10

యూపీఎస్‌లో చేరాలనే కచ్చితమైన నిబంధనను కేంద్రం పెట్టలేదు. ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఎస్‌లో అయినా కొనసాగవచ్చు లేదా యూపీఎస్‌లో చేరాలనుకుంటే చేరొచ్చని కేంద్రం తెలిపింది.   

7 /10

యూపీఎస్‌ కింద కనీసం పదేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు.. కనిష్టంగా కనీసం రూ.పది వేల పెన్షన్ పొందుతారు.  

8 /10

ఎన్‌పీఎస్‌ను కేంద్రం జనవరి 1, 2004న ఓపీఎస్ స్థానంలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి సర్వీస్‌లో చేరిన ఉద్యోగులు అందరూ ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చారు.  

9 /10

అయితే ఎన్‌పీఎస్‌ను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఓపీఎస్‌నే అమలు చేశాయి.   

10 /10

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. యూపీఎస్ గురించి పూర్తి తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.