Telangana Bandh: తెలంగాణలో ఈనెల 9న స్కూళ్లు, కాలేజీల బంద్‌ పిలుపు..!

Maoists Call Bandh In Telangana: చెల్పాకలో నవంబర్‌ 30న జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గురువారం ఈ బంద్‌కు సంబంధించిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్‌ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
 

1 /5

చెల్పాకలో డిసెంబర్‌ 1న విప్లవకారులను అతి దగ్గరగా కిరాతకంగా గ్రేహౌండ్‌ పోలీసులు కాల్చి చంపారు. అప్రూవర్‌గా మారిన ఇన్‌ఫార్మర్‌తో భోజనంలో విషం కలిపి స్పృహ కోల్పోయిన ఏడుగురు విప్లవకారులు పడిపోయారు.  

2 /5

వీరిని అదుపులోకి తీసుకున్న గ్రేహౌండ్‌ పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టి అతి దగ్గరగా డిసెంబర్‌ 1వ తేదీ ఉదయం కాల్చి చంపారు. ఈ ఘటనలో ఏడుగురు విప్లవకారులు చనిపోయారు.  

3 /5

ఇందులో మంగు అలియాస్‌ పాపన్న, జైసింగ్‌, బద్రు, మధు, కోటి, కరుణార్‌, జమున, కిషోర్‌, కామాల్‌లు ప్రాణాలర్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ హత్యకాండకు బాధ్యతవహించాలని డిసెంబర్‌ 9న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.  

4 /5

ప్రజల కోసం పోరాడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ కగార్‌ కొనసాగిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలకు చేస్తున్నారన్నారు.  

5 /5

ఈ దారుణ మరణ కాండకు నిరసనగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా ఈనెల అనగా డిసెంబర్‌ 9న బంద్‌ పాటించాలని మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x