YSRCP: వైసీపీ నేతపై కత్తులతో దాడి

విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడిలో స్థానిక వైసీపీ నేతపై కత్తులతో దాడి జరిగింది( Attack on YSRCP leader). వైఎస్సార్సీపీ నేత, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Last Updated : Jun 4, 2020, 02:41 PM IST
YSRCP: వైసీపీ నేతపై కత్తులతో దాడి

విశాఖ: విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడిలో స్థానిక వైసీపీ నేతపై కత్తులతో దాడి జరిగింది( Attack on YSRCP leader). వైఎస్సార్సీపీ నేత, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన గేదెల సత్యనారాయణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి )

రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతున్న సత్యనారాయణకు పడని ప్రత్యర్థులే ఈ పని చేశారా లేక ఈ దాడి వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News