House Owner Gangrape Case: ఇంట్లో అద్దెకు దిగి.. నలుగురిచేత గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ

Woman gang raped by 4 men in MP: ఇంటి యజమానురాలు అక్కడ రైలు దిగడంతోనే తన మనుషులతో కిడ్నాప్ చేయించిన మహిళ.. ఆమెను ఒక గదిలో బంధించింది. అంతటితో ఆమె అరాచకం ఆగలేదు. తనకు తెలిసిన నలుగురు వ్యక్తుల చేత ఇంటి యజమానురాలిని తీవ్రంగా కొట్టి హింసించింది. ఆ నలుగురి చేత గ్యాంగ్ రేప్ చేయించింది. 

Written by - Pavan | Last Updated : Dec 21, 2022, 11:15 AM IST
  • ఇంట్లో అద్దెకు దిగి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్న మహిళ
  • అప్పు తిరిగి అడిగినందుకు ఇంటి యజమానురాలిపైనే దాడి
  • నలుగురు వ్యక్తులతో గ్యాంగ్ రేప్.. తాను కూడా అసహజ పద్ధతిలో లైంగిక దాడి
House Owner Gangrape Case: ఇంట్లో అద్దెకు దిగి.. నలుగురిచేత గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ

Woman gang raped by 4 men in MP: మహిళకు మహిళే శత్రువు అని అప్పుడప్పుడు వాళ్లు, వీళ్లు చెబుతుంటే వింటుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలోనూ అదే నిజం అని నిరూపితమైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఒక 20 ఏళ్ల యువతికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. పాపం.. సాటి మహిళ కదా అని తన ఇంట్లో గదిని ఆమెకు అద్దెకు ఇవ్వడమే ఆ ఇల్లాలి పాలిట శాపమైంది. ఇల్లు కిరాయికి ఇవ్వడమే కాకుండా ఇంట్లో అద్దెకు దిగిన మహిళ కోరిక మేరకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 5 లక్షలు అప్పుగానూ ఇచ్చారామె. ఆ మహిళ అసలు రంగు, గుణం ఏంటో తెలియకుండా ఇల్లు అద్దెకు ఇవ్వడం మొదటి తప్పు కాగా.. ఆమెను గుడ్డిగా నమ్మి 5 లక్షలు అప్పుగా ఇవ్వడం ఆమె చేసిన రెండో తప్పయింది. 

మూడు నెలల్లో 5 లక్షల డబ్బు తిరిగి ఇస్తానని చెప్పిన మహిళ.. ఆ డబ్బులు ఇవ్వకపోగా ముఖం చాటేసింది. గట్టిగా నిలదీయడంతో మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఉన్న తన స్వగ్రామానికి వచ్చి బాకీ డబ్బులు తిరిగి తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. మరోసారి ఆ మహిళ మాటలు నమ్మిన ఇంటి యజమానురాలు.. తనకు రావాల్సిన డబ్బుల కోసం ఒంటరిగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌కి వెళ్లింది. 

ఇంటి యజమానురాలు అక్కడ రైలు దిగడంతోనే తన మనుషులతో కిడ్నాప్ చేయించిన మహిళ.. ఆమెను ఒక గదిలో బంధించింది. అంతటితో ఆమె అరాచకం ఆగలేదు. తనకు తెలిసిన నలుగురు వ్యక్తుల చేత ఇంటి యజమానురాలిని తీవ్రంగా కొట్టి హింసించింది. ఆ నలుగురి చేత గ్యాంగ్ రేప్ చేయించింది. తాను కూడా ఆ మహిళపై అసహజ పద్ధతిలో లైంగిక దాడికి పాల్పడింది. అలా ఆరు రోజుల పాటు గ్యాంగ్ రేప్‌కి పాల్పడుతూ నరకం చూపించింది.  

ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి బాధితురాలిని విడిచిపెట్టింది. ఆరు రోజుల పాటు వారి చేతుల్లో ప్రత్యక్ష నరకం చూసిన బాధితురాలు డిసెంబర్ 15న వారి చేతుల్లోంచి బయటపడి నేరుగా ఝాన్సీకి చేరుకుని జరిగినదంతా తన కుటుంబసభ్యులకు చెప్పుకుని బోరుమంది. కుటుంబసభ్యులు ఇచ్చిన ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంట్లో అద్దెకు దిగిన మహిళ అరాచకం ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్యాయత్నం నేరాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం మధ్యప్రదేశ్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి : Delhi acid attack case: నిందితులకు యాసిడ్ ఎలా వచ్చింది? కీలక వివరాలు వెల్లడించిన ఫ్లిప్‌కార్ట్

ఇది కూడా చదవండి : Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త

ఇది కూడా చదవండి : Gang Rape: 16 ఏళ్ల బాలికపై గాంగ్ రేప్,, 8 మంది కలిసి 14 గంటలపాటు దారుణంగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News