Pavitra Lokesh: అల్లరి చేస్తున్నారు, ఆపండి.. నరేష్ పేరు లాగుతూ 'సైబర్ క్రైం'కు పవిత్ర ఫిర్యాదు!

Pavitra Lokesh Cyber Crime Case: తనపై, నటుడు నరేష్ పై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ పవిత్ర లోకేష్ హైదరాబాద్ సైబర్ పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది, ఆమె పలు ఛానల్స్, వెబ్ సైట్స్ లిస్టు కూడా వారికి అందచేసినట్టు చెబుతున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 26, 2022, 06:12 PM IST
Pavitra Lokesh: అల్లరి చేస్తున్నారు, ఆపండి.. నరేష్ పేరు లాగుతూ 'సైబర్ క్రైం'కు పవిత్ర ఫిర్యాదు!

Pavitra Lokesh Complains on websites and Channels: ఏడాది టాలీవుడ్ నుంచి విపరీతంగా హాట్ టాపిక్ అయిన అంశాలలో పవిత్ర లోకేష్ -నరేష్ వ్యవహారం ఒకటి. వీరిద్దరూ తమ మంచి స్నేహితులమని చెబుతున్నా వారిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా రకరకాల ప్రచారాలు అయితే తెరమీదకు వస్తున్నాయి. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి మైసూర్ హోటల్ లో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత ఎక్కువగా ఈ జంట మళ్ళీ వార్తల్లోకి రాలేదు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు, అలాగే పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో కూడా వీరిద్దరు జంటగా అన్నీ కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరి గురించి పలు వెబ్ సైట్స్ లో కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద సైబర్ క్రైమ్ పోలీసులను సినీనటి పవిత్ర ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన పట్ల నటుడు నరేష్ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆమె తమ మీద అభ్యంతరకర కామెంట్లతో పాటు ఫోటోలు సైతం మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఇక పవిత్ర ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్సైట్స్  ఉద్దేశపూర్వకంగానే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిజానికి కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో వీరిద్దరూ కలిసి కనబడడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఎందుకంటే నరేష్ అధికారికంగా వివాహం చేసుకున్న ఆయన మూడో భార్య ఎక్కడో మూలన నిలబడి ఉంటే నరేష్ పవిత్రను కృష్ణ పార్థివదేహం దగ్గరికి చేయి పట్టుకుని తీసుకు వెళ్లడం అంత మంది ప్రముఖుల మధ్యలో కూడా వీరిద్దరు జంటగా తిరుగుతూ ఉండటం మీద నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక రకాల వార్తలు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు తమ గురించి ఎంత ప్రచారం జరుగుతున్నా సైలెంట్ గానే భరిస్తూ వచ్చిన పవిత్ర లోకేష్ ఇప్పుడు మాత్రం ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె ఎవరెవరి మీద ఫిర్యాదు చేశారు అనే విషయాలు ఇంకా క్లారిటీ లేదు. 

Also Read: Actor Simbhu: ఎన్టీఆర్ తరువాత కుర్ర హీరో కోసం శింభు 'గాత్ర దానం'

Also Read: Content is the King: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News