మరోసారి హాట్ టాపిక్ అయిన రష్మీ గౌతమ్ వ్యాఖ్యలు..

 తరుచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసే యాంకర్ రష్మీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సరోగసీ (అద్దె గర్భం)పై సినీ నటి, యాంకర్ రష్మి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

Last Updated : May 18, 2020, 09:54 PM IST
మరోసారి హాట్ టాపిక్ అయిన రష్మీ గౌతమ్ వ్యాఖ్యలు..

హైదరాబద్: తరుచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసే యాంకర్ రష్మీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సరోగసీ (అద్దె గర్భం)పై సినీ నటి, యాంకర్ రష్మి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే బదులు అనాధ పిల్లలను దత్తత తీసుకోవచ్చంటూ రష్మి వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సరోగసీని (Surrogacy) సమర్ధించివాళ్ళపై ఆమె ఘాటుగా స్పందించారు. సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా అంటూ ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ వివక్షను చూపించడమే అవుతుందని పేర్కొంది. 

Also Read: అఫ్రిది వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత క్రికెటర్లు..

మరోవైపు ఈ సరోగసీని ప్రోత్సహించడం అనేది కులాభిమానం, మతాభిమానం వంటిదేనని విమర్శించింది. పిల్లల విషయంలో జీన్స్ కొంత వరకే ఉపయోగపడతాయని మిగిలిందంతా తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. రష్మి గౌతమ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా రష్మీ చేసిన వ్యాఖ్యలపై కొందరు మద్దతుగా నిలుస్తుంటే మరి కొందరు విమర్శిస్తున్నారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News