బక్రీద్ పండగ సెలవుపై కేంద్రం ప్రకటన

బక్రీద్ పండగ సెలవుపై కేంద్రం ప్రకటన

Last Updated : Aug 15, 2018, 03:22 PM IST
 బక్రీద్ పండగ సెలవుపై కేంద్రం ప్రకటన

బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 23న ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 22నే సెలవు దినంగా పరిగణిస్తున్నట్టుగా గతంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ముస్లిం సోదరులు నెలవంకను అనుసరిస్తూ ఈద్‌-ఉల్‌-జుహాను ఈ నెల 23న జరుపుకుంటున్నట్టుగా ఆలస్యంగా తెలుసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా సెలవు దినాన్ని మారుస్తూ ప్రకటన విడుదల చేసింది.  

Trending News