భారత సైనికులకు దీపావళి కానుక ఇదే..!

           

Last Updated : Oct 19, 2017, 11:20 AM IST
భారత సైనికులకు దీపావళి కానుక ఇదే..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ యావత్ భారతదేశానికి ట్విటర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం దీపావళిని ఆయన ఉత్తరాఖండ్, చైనా బోర్డర్ సరిహద్దుల వద్ద కాపుగాస్తున్న సైనికులతో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దుల వద్ద కాపుగాస్తున్న సైనికులకు దీపావళి బహుమతి అందించారు. ఇప్పటి వరకు సైనికులు లేదా ఆర్మీ ఆఫీసర్లు డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్‌ను వాడాలంటే 500 రూపాయలను నెలవారీ ఛార్జీల క్రింద చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పటినుండి ఆ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఇకపై వారు ఆ టెర్మినల్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే గతంలో నిముషానికి 5 రూపాయలు పడే ఈ ఫోన్ ఛార్జీలు, ఇకపై 1 రూపాయి మాత్రమే పడేవిధంగా ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఈ గురువారం నుండి వారికి ఈ కొత్త ఫోన్ ఛార్జీలు వర్తిస్తాయి. 

సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ విషయంపై మాట్లాడుతూ " రిమోట్ ఏరియాలలో పనిచేసే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, బీఆర్‌ఓ, ఐటిబీపీ జవాన్లు రాత్రనకా, పగలనకా తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు.వారు కుటుంబంతో ఎప్పుడైనా మాట్లాడాలంటే, బీఎస్‌ఎన్ఎల్ డీఎస్‌పీటీ సర్వీస్ మీద ఆధారపడాల్సిందే. దేశం కోసం ఎంతో చేస్తున్న సైనికులకు ఆ సర్వీస్ ఛార్జీలు లేకుండా చేసి, వారు తమ కుటుంబాలతో మాట్లాడే వెసులుబాటును మరింత సులభతరం చేసేందుకే ఈ దీపావళి కానుక. జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు" అని తెలియజేశారు.  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x