రైల్వే ప్రయాణికులకు.. కేవలం ఒక్క రూపాయికే వైద్యం..!

రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా.. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తవచ్చు. 

Last Updated : May 13, 2018, 05:52 PM IST
రైల్వే ప్రయాణికులకు.. కేవలం ఒక్క రూపాయికే వైద్యం..!

రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా.. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తవచ్చు. అలాగే రైలు ప్రయాణం ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం బారిన పడినా డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటే ఎలా? సమయానికి ఆ స్టేషను దగ్గర డాక్టర్ దొరుకుతాడా లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తవచ్చు.

ఒకవేళ అలాంటి సమయంలో ట్రీట్‌మెంట్ చేయించుకున్నా ఎంత బిల్లు వేస్తారన్న విషయంలో కూడ మీమాంస ఎదురుకావచ్చు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ఇస్తూ.. ప్రయాణికుల భద్రతకు, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని చెబుతోంది సెంట్రల్ రైల్వే. అందుకోసమే ఓ పథకంతో ముందుకు వచ్చింది. ఆ పథకంలో భాగంగానే "మ్యాజిక్ డిల్" అనే ఆరోగ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే స్టేషన్లలో "మ్యాజిక్ డిల్" ఆరోగ్య ఔట్‌లెట్లు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఆ మినీ ఆసుపత్రుల్లో రోగి నుండి కేవలం రూ.1 మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా తీసుకుంటారు. ఇవి మినీ ఆసుపత్రులన్న మాట. ఆ ఆరోగ్య ఔట్‌లెట్లలో పేషెంటుకి ట్రీట్‌మెంట్ చేయడానికి ఓ డాక్టరు, కాంపౌండర్, నర్సు కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. రైల్వే ట్రాక్ల మీద

యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు తక్షణ వైద్య సహాయం అందించడం కోసం రైల్వే శాఖ ఎలాంటి పథకం కూడా ఎందుకు తీసుకురాలేదని ఓ ఆర్టీఐ యాక్టివిస్టు కోర్టులో వేసిన పిల్ మేరకు బొంబాయి హైకోర్టు తీర్పు ఇస్తూ.. సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే రైల్వేస్టేషన్లలో ఎమర్జెన్సీ ఆరోగ్య ఔట్‌లెట్లు ఏర్పాటు చేయమని తెలిపింది. ఆ తీర్పు మేరకు సెంట్రల్ రైల్వే ఈ మినీ ఆసుపత్రుల పథకానికి నాంది పలికింది. 

Trending News