వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

Last Updated : Mar 12, 2018, 07:08 PM IST
వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ ఇరువురు నేతలు అక్కడ జరిగే అనేక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు గంగా నది తీరంలో పడవ ప్రయాణం చేస్తారు. తొలుత ఈ ఇద్దరు నాయకులు మిర్జాపూర్‌కు బయలుదేరుతారు. వారణాసికి వచ్చే ముందు అక్కడ వారు సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. వారణాసిలో మరల ఈ  ఇద్దరు నాయకులు దీన్ దయాళ్ హస్తకళా సంకుల్‌ను సందర్శిస్తారు. అక్కడి కళాకారులతో ముచ్చటిస్తారు.

 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌తో కలిసి  వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్ వద్దకు వెళ్తారు. అక్కడ వారు బోటు ప్రయాణం చేస్తూ గంగా ఘాట్‌లను తిలకిస్తారు.  ఈ పడవ ప్రయాణం చారిత్రక దశాశ్వమేధ ఘాట్ వద్ద ముగుస్తుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడికి గౌరవార్థం ప్రధాన మంత్రి మోదీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ప్రధానమంత్రి వారణాసిలోని మధుదిహి రైల్వే స్టేషన్ నుండి పాట్నాకు వరకు వెళ్లే  రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.

 

 

ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఆగ్రాలోని  తాజ్‌మహల్‌ను సందర్శించారు. శనివారం, మోదీ, మక్రోన్‌ల మధ్య చర్చలు ముగిశాక, భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంపొందించుకోవడానికి గాను రక్షణ, అణుశక్తి తదితర అంశాలతో సహా 14 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ భేటీలో తీవ్రవాద అంశంపై కూడా చర్చలు జరిపినట్లు.. ఈ క్రమంలో ఇరువురు నేతలు టెర్రరిజాన్ని రూపుమాపడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 

Trending News