ICMR సలహా.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించుకునేందుకు విదేశాల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు కోవిడ్19 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 28, 2020, 07:53 AM IST
ICMR సలహా.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

చెన్నై: కరోనా పాజిటివ్ కేసులను సరిగ్గా నిర్ధారించుకునేందుకు విదేశాల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు కోవిడ్19 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే 2 చైనా కంపెనీల కిట్లను వాడవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సూచించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి

గాంగ్జౌ వాండ్‌ఫో బయోటెక్, ఝుహాయ్ లివ్‌జాన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న 24,000 కోవిడ్19 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వెనక్కి పంపాలని, తాజాగా ఇచ్చిన ర్యాపిడ్ కిట్స్ ఆర్డర్లను కూడా రద్దు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధకారులు చెబుతున్నారు.  . Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

రూ.245 విలువ ఉన్న ర్యాపిడ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం రూ.600 చెల్లించి అధిక ధరకు కొనుగోలు చేసిందని ప్రతిపక్షనేత డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపించడం తెలిసిందే. అవగాహన లేకుండా స్టాలిన్ ఆరోపణలు చేస్తున్నారని తమిళనాడు సీఎం కార్యాలయం స్పందించింది. అధిక రికవరీ కేసులు తమిళనాడులోనే ఉన్నాయని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్ అన్నారు. యాభై శాతానికి పైగా పేషెంట్లు కోలుకుంటుండగా, మరణాల రేటు 1.2శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News