పార్లమెంట్ వద్ద తెలుగు ఎంపీల ఆందోళన; ప్రత్యేక హోదా కోసం..ఆ ఎంపీ ప్రత్యేక గెటప్

పార్లమెంట్ సమావేశాలు ప్రాంరభమైన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం మళ్లీ తెలుగు ఎంపీ ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టారు.

Last Updated : Dec 27, 2018, 02:27 PM IST
పార్లమెంట్ వద్ద తెలుగు ఎంపీల ఆందోళన; ప్రత్యేక హోదా కోసం..ఆ ఎంపీ ప్రత్యేక గెటప్

ఢిల్లీ: వినూత్న వేషాధారణకు కేరాఫ్ అడ్రస్..టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోమారు విచిత్ర వేషం వేసి అందరి దృష్టిన పడ్డారు. ఈ ఏరి ఏకంగా రావణాసురుడి వేషంతో ప్రత్యేక్షమయ్యారు. ఇంతకీ ఎందుకు ఆయన ఈ విషయంలో కనిపించాల్సి వచ్చింది అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.

పార్లమెంట ఉభయ సభలు ప్రారభమైన నేపథ్యంలో అటు వైసీపీ..ఇటు టీడీపీ ఎంపీలు తమదైన శైలిలో ఆందోళన కార్యక్రమాలు చేపటుడుతున్నారు. ఇప్పటికే ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడుతుంటే ..మరోవైపు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆవరణలో తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత శివప్రసాద్ రావణాసురుడి వేషధారణలో పార్లమెంటుకు హాజరయ్యారు. నరేంద్ర మోదీ ముఖాలు ఉన్న 10 స్టిక్కర్లను ఆయన తలకు అంటించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీని రావణాసుడితో పోల్చారు.  మోడీకి రావణాసుడికి 10 కంటే ఎక్కువ అవలక్షణాలు ఉన్నాయని ఈ సందర్భంగా శివప్రసాద్  దుయ్యబట్టారు.

Trending News