Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..

Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి  బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.

1 /6

ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 నిముషాలకు బాధ్యతలు స్వీకరించారు. వేద  పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరీ సైతం ఈ కార్యక్రామంలో పాల్గొన్నారు. 

2 /6

చంద్రబాబు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో.. ఏపీ మంత్రులు, అచ్చేన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

3 /6

అంతకు ముందు చంద్రబాబుకు సచివాయం సిబ్బంది, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక చంద్రబాబు ఎన్నికల సందర్భంగా మెగాడీఎస్సీ ఇస్తానని హమీ ఇచ్చారు. దీనిలో భాగంగా.. 16,347 టీచర్ పోస్టులకు పచ్చజెండా ఊపారు. దీంతో అభ్యర్థులు ఎంతో  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

4 /6

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసంతకం, మెగా డీఎస్సీ,  ల్యాండ్ టైటనింగ్  యాక్టు రద్దుపై రెండో సంతకం, సామాజిక ఫింఛన్లు రూ. 4 వేలకు పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణపై నాలుగొ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.  మెగా డీఎస్సీ నోటీఫికేషన్ ద్వారా..ఎస్ జీటీ- 6,371, పీఈటీ - 132, స్కూల్ అసిస్టెంట్లు - 7725, టీజీటీ- 1781, పీజీటీ- 286, ప్రిన్సిపాల్ - 52 పోస్టులకు నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

5 /6

ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బిజీగా ఉంటున్నారు.  ప్రమాణ స్వీకారం చేశాక నేరుగా కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.  స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

6 /6

అక్కడ నుంచి మరల విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సచివాలంలో సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఇచ్చిన హమీలపై సంతకాలు చేసి ఏపీ పాలనలో తనదైన మార్కును మరోసారి ప్రారంభిచారు.