Biggest Telugu Multistarrer: ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్.. ఎవరెవరంటే!

Crazy Multistarrer in Tollywood: ఈమధ్య టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల హవా మరొకసారి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ముగ్గురు హీరోలు కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
 

1 /5

ఈమధ్య మల్టీ స్టారర్ల ట్రెండ్ చాలా బాగా నడుస్తోంది. తన మన బేధం లేకుండా అందరు హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఓకే చెప్తున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన మల్టీస్టారర్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దాని గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

2 /5

త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించబోతున్నారు. ఒకరు గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. ఈ మధ్యనే చత్రపతి హిందీ రీమేక్ తో.. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా తెలుగులో రెండు మూడు సినిమాలు ఒకే చేసిన బెల్లంకొండ.. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బెల్లంకొండ మెయిన్ హీరోగా నటిస్తున్నారు. 

3 /5

ఈ సినిమాలో మరొక ఇద్దరు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అందులో ఒకరు మంచు మనోజ్. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ మిరాయి సినిమాలో.. నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు కూడా ఓకే చెప్పారు. ఇది కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా లైన్ లో పెడుతున్నారు అని టాక్.  

4 /5

ఈ మల్టీ స్టారర్ లో నటించిన మూడవ హీరో నారా రోహిత్. ఇతను కూడా కొద్దిరోజులుగా సినిమాలలో కనిపించలేదు. మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మధ్యనే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల.. ఈ మల్టీస్టారర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.  

5 /5

విజయ్ కనకమేడల చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ ముగ్గురు హీరోలు వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో.. బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డేట్లు కుదరకపోవడంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకి రీమేక్ అని టాక్ నడుస్తోంది కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.