8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.34,560 పెంపు!

8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం నుంచి తియ్యని శుభవార్తను పంచుకోబోతోంది. తరచుగా ఉద్యోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కార్ ఉద్యోగులకు సంబంధించిన పేస్కేల్లో సవరణ చేయబోతోంది. 

1 /7

8 పే కమిషన్ (8th pay commission)కి ముందు వచ్చిన రెండు పే కమిషన్లలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలోని ఇతర మార్పులను క్లుప్తంగా వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వ్యవస్థలో అనేక మార్పులను తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ఎనిమిదో వేతన సంఘం వివిధ వేదికలను చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.   

2 /7

ఇక 7 వేతన సంఘం (7th pay commission) విషయానికి వస్తే ..ఇందులో కూడా ప్రభుత్వం కొన్ని అంశాలను ప్రస్తావించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 28న ఏర్పాటు చేయగా.. ఈ ఏడవ వేతన సంఘాన్ని 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది.   

3 /7

ఏడవ వేతన (7th pay commission) సంఘం ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి కనీస వేతనం రూ.18,000 పాటు ఉండేటట్లు కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.57 ఉండేటట్లు చూసింది. దీంతో ఒక్కొక్క ఉద్యోగికి ఈ పే కమిషన్ ప్రకారం దాదాపు రూ. 11,000 పైగా జీతం పెరిగింది.   

4 /7

ఇక ఆరవ వేతన సంఘం (6th pay commission) వివరాలు చూస్తే.. ఈ సంఘాన్ని జులై 2006 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రకారం ఒక ఉద్యోగి వేతనం ప్రాథమికంగా రూ. 7,000 కొనసాగించాలని 2008 సంవత్సరంలోని ఆగస్టు రెండో వారంలో ఆమోదం తెలిపింది.   

5 /7

6 వేతన సంఘం (6th pay commission) ప్రకారం మొదటి ఫిట్మెంట్ను 1.74 సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.. అయితే దీనిని పోను పోను 1.86కి పెంచుతూ వచ్చింది. ఈ సంఘం ప్రకారం ఉద్యోగులంతా 2008 సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని అలవెన్సులు పొందారు అలాగే జీవనాధార భత్యం (DA) కూడా 16 నుంచి 22 శాతానికి పెరిగినట్లు సమాచారం.   

6 /7

ఇక ఎనిమిదవ సంఘం వేతనం (8th pay commission) విషయానికొస్తే, దీనిని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరంలో అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.   

7 /7

ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తే.. ఒక్కొక్క ఉద్యోగి మూలవేతనం దాదాపు 20 నుంచి 35 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక జీతం లెక్కలు చూస్తే దాదాపు ఒక్కసారిగా రూ.34,560 పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వివిధ అలవెన్స్ లను కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.