Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..

Indiramma Illu: తెలంగాణలో పేద ప్రజలకు దీపావళి ఇవ్వనుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

 

1 /7

Indiramma Illu: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది కావొస్తోన్న హామిలు అమలులో వెనబడే ఉంది.ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగిలిన హామిలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

2 /7

మరోవైపు రైతు రుణమాఫీ అంటూ కొంత మంది రైతులకే లబ్ది చూకూరింది. చాలా మంది అర్హులైన రైతులకు రుణ మాఫీ కాలేదు. ఈ విషయమై తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు.

3 /7

మరోవైపు గృహ జ్యోతి పథకం కూడా కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే అనే లింకు పెట్టారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు వచ్చినప్పటి నుంచి కొత్త పెళ్లైన దంపతులెవరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.

4 /7

ఎంతో మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసి  ఉన్నారు. ఇప్పటికీ వాటిపై క్లారిటీ లేదు. అందులో ఎంతో మంది అర్హులైన పేదలున్నారు. వారికీ గృహ జ్యోతి పథకం అందడం లేదనే చెప్పాలి.

5 /7

మరోవైపు గృహ లక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు రూ. 2 వేలు అంటూ ఊదరగొట్టినా.. ఇప్పటికీ దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. మరోవైపు కేసీఆర్ సర్కారు.. కేంద్రంలో మోడీ సర్కార్ ఇచ్చిన నిధులతో  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన ఇళ్లను ఇప్పటికీ పేదలకు ఇవ్వలేదు.

6 /7

తాజాగా తెలంగాణ సర్కారు పేదలకు దీపావళి కానుక ఇవ్వబోతుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజు అమావాస్య కాబట్టి.. ఆ తర్వాత కార్తీకంలో మంచిరోజు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

7 /7

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించనుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది.