Tollywood Director Maruthi: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్‌లో మూవీ చూసిన ఆనందంలో డైరెక్టర్

  • Dec 04, 2020, 11:30 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మార్చి నెల నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూత పడ్డాయి. తాజాగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కావడంతో కొంత ఆసక్తి, ఆశ కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు వెళ్లి మూవీ వీక్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకున్నారు.

1 /5

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మార్చి నెల నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూత పడ్డాయి. తాజాగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కావడంతో కొంత ఆసక్తి, ఆశ కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు వెళ్లి మూవీ వీక్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకున్నారు.

2 /5

వినోదం కావాలి, కానీ ఏ ప్రమాదం లేకుండా హాయిగా వినోదాన్ని పొందాలని అన్ని జాగ్రత్తలు పాటించాలని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మేరకు స్క్రీన్ 6లో మూవీ చూసేందుకు వెళ్లారు. ఆయనతో పాటు కొందరు సన్నిహితులు కూడా ఉన్నారు.

3 /5

సినిమా టికెట్టు చూసి ఎన్ని రోజులైందో అంటూ నిన్న డైరెక్టర్ మారుతి ఓ మూవీ టికెట్ పోస్ట్ చేశారు. నేడు మూవీ చూసేందుకు ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లారు. టిక్కెట్ చూడగానే తెలుగు ప్రేక్షకులకు ప్రాణం లేచొచ్చినట్లవుతుంది.