ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన హైదరాబాద్ మెట్రో ఉద్యోగి..!

హైదరాబాద్ మెట్రోలో క్యాష్ మేనేజ్‌మెంట్ ఉద్యోగిగా సేవలందిస్తున్న ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు పోలీసులు.

Last Updated : Feb 16, 2018, 11:25 AM IST
ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన హైదరాబాద్ మెట్రో ఉద్యోగి..!

హైదరాబాద్ మెట్రోలో క్యాష్ మేనేజ్‌మెంట్ ఉద్యోగిగా సేవలందిస్తున్న ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో ట్రైన్ ఎక్కిన సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి రసూల్‌పూరా వెళ్లేందుకు రైలు మారాల్సినందున.. అమీర్‌పేట ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌లో దిగింది.

అక్కడ ఆమెతో పాటు లిఫ్ట్ ఎక్కిన నితిన్ రెడ్డి అనే క్యాష్ మేనేజ్‌మెంట్ ఉద్యోగి.. ఆ యువతిని అసభ్యంగా తాకడంతో ఆమె అభ్యంతరం తెలిపింది. అయినా ఆ ఉద్యోగి పదే పదే అలాగే ప్రవర్తించడంతో..  ఆమె స్థానిక ఎస్సాఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మెట్రో స్టేషనుకి వచ్చి ఉద్యోగి గురించి వాకబు చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Trending News