Mulugu Siddanthi: ప్రముఖ పంచాగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం!

Mulugu Siddanthi: ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్ను మూశారు. ఆనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 09:56 PM IST
Mulugu Siddanthi: ప్రముఖ పంచాగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం!

Mulugu Siddanthi: ప్రముఖ పంచాగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (Mulugu ramalingeswara siddhanti) శివైక్యం చెందారు. ఆదివారం ఆయన చాతి భాగంలో ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే పంజా గుట్ట నిమ్స్​కు తరలించారు.

అయితే ఆస్పత్రికి తరలించే సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచాని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితనం. పంచాగకర్తగానే కాకుండా.. టీవీ కార్యక్రమాల్లో ఉదయం పూట వార ఫలాలు కూడా చెప్పేవారు. ఆయన పూర్తి పేరు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్​.

జ్యోతిష్యంలో ఆయన 30 ఏళ్లుగా విశేష సేవలందించారు. ఆయన అకాల మరణం పట్ల ఆధ్యాత్మికవేత్తలు, జోతిష్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also read: Student appeals to KCR: 'సీఎం సార్ నేను చనిపోతా అనుమతివ్వండి ప్లీజ్'​.. అంటూ విద్యార్థి విజ్ఞప్తి

Also read: Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,603 కొవిడ్ కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News