4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకిస్తోన్న అభ్యర్దులు వీళ్లే..


4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఎంపీ అభ్యర్ధుల పోటీ చేస్తోన్న సీట్లపై ఆసక్తి నెలకొంది. 

1 /8

హైదరాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేస్తోన్న మాధవిలతా హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రచారంతో పాతబస్తీలో ఓవైసీకి చుక్కలు చూపిస్తోంది. ఈ సారి అక్కడా పోటీ హోరాహోరిగా ఉండనుంది.

2 /8

బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి ఎన్నికల గోదాలో ఉన్నారు.

3 /8

పశ్చిమ బంగాల్‌లో వివాదాస్పద నేత మహువా మొయిత్రా కృష్ణా నగర్ లోక్ సభ సీటు నుంచి టీఎంసీ తరుపున బరిలో ఉంది.

4 /8

  ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.యస్.షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి 4వ విడతలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

5 /8

  బెహ్రామ్ పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అధీర్ రంజన్ చౌదరి ఎంపీగా పోటీ చేస్తున్నారు.  

6 /8

  పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి టీఎంసీ తరుపున శతృఘ్న సిన్హా బరిలో ఉన్నారు.

7 /8

  ఝర్ఖండ్‌లోని కుంతీ నుంచి మాజీ సీఎం అర్జున్ ముండా బరిలో ఉన్నారు.

8 /8

  యూపీలోకి కన్నౌజ్ నుంచి యూపీ మాజీ సీఎం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు.