Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా..?

Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా. మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నా.. మహాలయ పక్షాల్లో కూడా శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? అంటే ఔననే అంటున్నాయి ధర్మ శాస్త్ర గ్రంథాలు.

1 /11

Mahalaya Pitru Paksham: మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే•

2 /11

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం.

3 /11

పితృ తిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు.మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు అంటుంది  ధర్మ శాస్త్రం.

4 /11

మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు, వరదలు) ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చును. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసమే ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి.

5 /11

పితృతిథి నాడు మూడు తరాల వారికి పితృ, పితామహా, ప్రపితామహా (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది.

6 /11

కానీ, ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజుల్లో వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు.

7 /11

ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పక్షాల్లో పెట్టడం వలన పోతుందనేది ధర్మ శాస్త్రం చెబుతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .. పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ ఈ సందర్భంగా దీవిస్తారు.  

8 /11

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం  అత్యుత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం అత్యంత  ప్రశస్తం. దీనినే.. సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ...వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం శ్రాద్ధం పెట్టాలి.

9 /11

గతేడాడి చనిపోయిన వారికి భరణి లేదా భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

10 /11

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర, పెట్టి  సత్కరించి పంపాలి.

11 /11

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘటచతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి.