Manu bhaker: దుమ్మురేపుతున్న మనుభాకర్.. 40 కిపైగా కంపెనీల నుంచి ఆఫర్స్.. ఆమె బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..?

Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనూభాకర్ మన దేశపు ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం మనదేశ అథ్లేట్లు ఇంకా ఒలింపిక్స్ లో పతకాల కోసం పోరాడుతున్నారు.  

1 /8

విశ్వక్రీడలు ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. రెండు పతకాలు గెల్చుకుని మనూబాకర్ హిస్టరీ క్రియేట్ చేశారు. అదే విధంగా మరో పతకాన్ని ఇటీవల షూటింగ్ లోనే స్వప్నిల్ కైవసం చేసుకున్నాడు.

2 /8

ఈ నేపథ్యంలో ప్రపంచ క్రీడల్లో మన దేశం మూడపతకాలను గెల్చుకుంది. అదేవిధంగా మనూబాకర్ ట్రైనింగ్ కోసం కేంద్రం ఖేలో ఇండియాలో భాగంగా ఆమెపై రెండు కోట్లు ఖర్చుచేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మనూను.. స్విట్జర్లండ్, జర్మనీ దేశాలకు పంపించి ఆమెకు నచ్చిన ట్రైనర్ తో షూటింట్ లో మెళకువలు నేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. 

3 /8

మనూబాకర్ కూడా ఎంతో కష్టపడి మనదేశానికి పతకాలు సాధించడంలో ఆమె పడిన కష్టం ఫలించిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. మనూబాకర్ దేశంలో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆమె బ్రాండ్ విలువ దక్కించుకునేందుకు అనేక కంపెనీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

4 /8

పారిస్ ఒలింపిక్స్ ముందు మనూబాకర్.. బ్రాండ్ గా ఉండేందుకు గాను..20-25 లక్షల వరకు వసూలు చేసేదంట. కానీ ఒలింపిక్స్ లో పతకాలు గెలవడంతో ఆమె ఒక రేంజ్ లో పాపులారీటీ సంపాదించుకున్నారు. దీంతో ఆమె కూడా తన బ్రాండ్ విలువను మార్కెట్ లో 6 నుంచి 7 రెట్లు పెంచుకున్నట్లు తెలుస్తోంది.

5 /8

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనూభాకర్.. ఎండార్స్ మెంట్ కు గాను.. ఒక్కొ కంపెనీ నుంచి 1.5 కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 40 కిపైగా కంపెనీలు ఇప్పటికే మనూభాకర్ బ్రాండ్ కోసం క్యూలో ఉన్నాయంట.

6 /8

ఇప్పటికే చాలా కంపెనీల మధ్య అగ్రిమెంట్ పూర్తయిందని, కొన్ని కంపెనీలు ఏడాదికి గాను, మరికొన్ని ఒక నెల, మూడు నెలల పాటు కూడా బ్రాండ్ అంబాసిడర్ కోసం తమను సంప్రదించారంటూ కూడా మనూభాకర్ టీమ్ ఒక ప్రకటలో వెల్లడించారు.

7 /8

గతంలో మనూభాకర్ ఆసియా గేమ్స్, కామన్ వెల్త్ గెమ్స్ సాధించింది. కానీ అప్పుడు మాత్రం.. ఇప్పుడున్నంత క్రేజ్ రాలేదని, ప్రస్తుతం ఇంకా అనేక కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా మనూ టీమ్ తెలిపారు.   

8 /8

ఇదిలా ఉండగా.. గతంలో మనూభాకర్ ను అభినందిస్తు.. ఆమె బ్రాండ్ ను చూపే విధంగా.. ఫోటోలు, వీడియోలను ప్రచారంగా ఉపయోగించుకుంటున్న కొన్నికంపెనీలపై నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.