Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!

Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది  అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు. నైవేద్యం ఏం పెడతారు పూజావిధానం తెలుసుకుందాం.
 

1 /5

నవ రాత్రులు గురువారం 3 వ తేదీ నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ ప్రత్యేక రోజుల్లో నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా అమ్మ వార్లను 9 అవతారాల్లో పూజించి నైవేద్యం పెట్టి పూజిస్తారు. అయితే, మొదటి రోజు శైలపుత్రి బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో పూజిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మ వార్ల అవతారాలను పరిగణలోకి తీసుకుంటారు.  

2 /5

ఈరోజుల్లో ఇంట్లోనే మాత్రమే కాదు.. మండపాలు కూడా ఏర్పాటు చేసుకుని అమ్మ వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకుంటున్నారు. దుర్గా మాతను పూజించడం వల్ల జీవితంలో శత్రు బాధలు తొలగిపోతాయి.  

3 /5

మొదటిరోజు 3వ తేదీ అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతిరూపం.  

4 /5

పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఏర్పాటు చేసి అక్షితలు, పూలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించడం వల్ల  అమ్మవార్ల కృపకు పాత్రులవుతారు.  

5 /5

ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి, వడపప్పు ప్రసాదంగా పెడతారు. ఇందులో ఉపయోగించే మిరియాలు భూత ప్రేత పిశాచాలను తరమడానికి ఉపయోగిస్తారని పండితులు చెబుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)