మగధీర, బాహుబలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై .. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
మగధీర, బాహుబలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై .. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి .. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదలవుతుందని స్పష్టం చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 16 భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు.
తాజాగా RRR మూవీ.. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేరిటికల్ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 72 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ కావాల్సి ఉంది.
అటు ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఐతే విడుదల తేదీ ఆలస్యం కావడంతో.. కాస్త నిరాశలో ఉన్నారు. మరోవైపు సినిమా కోసం ఎదురు చూస్తున్న కొంత మంది ఫ్యాన్స్ .. ఈ లోగా తమ అభిమాన తారల చిత్రాలు వేస్తున్నారు.
సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా చిత్రాలు వేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విల్లు ఎక్కుపెట్టినట్లుగా వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. RRR సినిమా పేరుతో ఏర్పాటు చేసిన ట్విట్టర్ లో ఆ చిత్రాలను పోస్టు చేశారు.
Next Gallery