Amrapali kata: ఆమ్రపాలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు .. ఎందుకో తెలుసా..?

TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్  షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు..  న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

1 /5

జీహెచ్ఎంసీ మున్సిపాల్ కమిషనర్ ఆమ్రపాలీకి హైకోర్టు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది.  తెలంగాణ హైకోర్టు.. ఆమ్రపాలికి బుధవారం నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితోపాటు..  తెలంగాణ భూగర్భ గనులు, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శులపై కూడా ధర్మాసం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.  

2 /5

 ముఖ్యంగా.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాస ప్రాంతాల్లో బండ రాళ్లను తొలగించేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా భారీ పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పట్ల.. ఇటీవల కాలంలో పలు పత్రికలలో అనేక కథనాలు కూడా వెలువడ్డాయి.   

3 /5

ఈ నేపథ్యంలో.. అయితే ఈ న్యూస్ పేపర్‌లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఒక లేఖ రాశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో.. రాత్రి పగలు అనే తేడానే లేకుండా.. నిత్యం పేలుళ్లు జరపడం వల్ల.. అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ లేఖలో.. జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. 

4 /5

కనీసం నిద్ర కూడా పోవట్లేదని సీజేకు రాసిన లేఖలో వెల్లడించారు. ఇక హైకోర్టు జడ్జి రాసిన ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. బుధవారం ఈ పిల్‌పై విచారణ జరిపింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది.   

5 /5

 ఈ కేసులో రాష్ట్ర భూగర్భ గనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు.. హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాలని ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు మిగితా వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కూడా హైకోర్టు ప్రతివాదుల్ని ఆదేశించింది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x