సైనా నేహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల ఆదర్శ వివాహం !

సైనా నేహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల ఆదర్శ వివాహం

Last Updated : Dec 14, 2018, 05:53 PM IST
సైనా నేహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల ఆదర్శ వివాహం !

హైదరాబాద్: గత కొంతకాలంగా ప్రేమలో వున్న ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ నేడు ఒక ఇంటి వారయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓరియాన్‌ విల్లాస్‌లో ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా ఇరు కుటుంబాలు, వారి సమీప బంధువులు, అతికొద్ది మంది సన్నిహితమిత్రుల మధ్య అత్యంత సాధారణంగా ఆదర్శవివాహం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ దంపతులు ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరికీ స్టార్ స్టేటస్ వున్నప్పటికీ.. ఎటువంటి హడావుడి లేకుండా అత్యంత సాదాసీదాగా పెళ్లి వేడుక ముగించుకుని నలుగురికి ఆదర్శంగా నిలిచింది ఈ జంట. 

Trending News