Mancherial News: ఇదేం విడ్డూరం.. భార్య ఎక్కువగా జ్యూస్ తాగుతుందని వదిలేసిన భర్త..

Mancherial News: పెళ్లైన రోజుల వ్యవధిలోనే భర్త, నవవధువుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఉండకుండా బైటకు వెళ్లిపోవడం చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన భార్య, నిలదీయడంతో ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు.

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2024, 01:36 PM IST
  • అత్తాగారింట్లో నవవధువుకు ఊహించని షాక్...
  • అన్నం తింటలేదని భార్యన వదిలేసిన భర్త..
Mancherial News: ఇదేం విడ్డూరం.. భార్య ఎక్కువగా జ్యూస్ తాగుతుందని వదిలేసిన భర్త..

Mancherial news husband harassed wife over drinking juice: కొందరు భర్తలు షాడిస్టులుగా ఉంటారు. పెళ్లిచేసుకున్న తర్వాత భార్యను వేపుకుని తింటుంటారు. అందంగా లేదని,కట్నంతేలేదని కొందరు వేధిస్తుంటారు. మరికొందరు తన భార్యకు వంట రాదని, చికెన్ వండలేదని, కర్రీలో ఉప్పు సరిగ్గా వేయలేదని గొడవలు పడుతుంటారు. ఇక కొందరైతే తమ భార్యలమీద ఎక్కడ లేని అనుమానాలు పెట్టుకుంటారు. కూర్చున్న అనుమానమే,నిలుచున్న అనుమానమే. ఏంచేసిన కూడా తమ భార్యను మనశాంతిగా అస్సలు ఉండనీయరు. ఆఫీసుకు వెళ్లిన, ఫోన్లలో ఎవరితోనైన మాట్లాడిన కూడా అనుమానంతోనే ఉంటారు. చివరకు ఇంట్లో వాళ్లతో మాట్లాడిన కూడా ఆరాలు తీస్తుంటారు. కొందరైతే తమ భార్యలకు ఫోన్ లు వాడొద్దంటారు. పుట్టింటి నుంచి ఎవరు రావద్దని, వచ్చిన కూడా చూసి అదే రోజు వెళ్లిపోవాలంటూ కూడా వేధిస్తుంటారు.

Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

ఇక పాలవాడు, ఇంటికొచ్చిన వాళ్లతో భార్య.. మాట్లాడిందంటే చాలు.. ఎక్కడ లేని అనుమానాలు పెట్టుకుంటారు. కొత్త చీర కట్టుకుంటే అనుమానం, చక్కగా రెడీ అయిన కూడ అనుమానాలతో భార్యను చంపేస్తుంటారు. కొందరు తమకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ తర్వాత ఎలాగైన భార్యలను వదిలించుకునేందుకు అనేక రకాలుగా భార్యలను వేధిస్తుంటారు. తమంతా తాముగా వెళ్లిపోయేలా చేస్తుంటారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

తెలంగాణలోని మంచిర్యాలలో జరిగిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన కాసిరెడ్డి పల్లెకు చెందిన సుంకరీ ప్రవీణ్‌ కుమార్ కు, మంచిర్యాలకు చెందిన యువతికరి ఈ నెల 24 న గ్రాండ్ గా పెళ్లి జరిగింది. అబ్బాయి తరుపు వాళ్లు అడిగిన విధంగా.. అమ్మాయి వాళ్లు అన్నిరకాల కట్న కానుకలు ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అయితే..పెళ్లి జరిగిన మరుసటిరోజు నుంచే భర్త షాడిజం స్టార్టు చేసేశాడు. ఎప్పుడు చూసిన బైటకు వెళ్లిపోవడం, రాత్రిపూట కూడా బైటనే ఎక్కువ సేపు ఉండేవాడు. దీంతో ఎన్నోసార్లు నవవధువు భర్తను నిలదీసింది.

అయిన కూడా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. చివరకు గట్టిగా నిలదీయడంతో ఆమెను పుట్టింటికి వెళ్లి వదిలేశాడు. దీంతో యువతి బంధువలు షాక్ కు గురయ్యారు. దీనిపై యువకుడి అమ్మానాన్నలతో మాట్లాడటానికి ప్రయత్నించగా, వారు రెస్పాండ్ అవ్వలేదు. ఈక్రమంలో.. యువతి అత్తగారింట్లో అన్నం తినట్లేదని, కేవలం జ్యూస్ లు మాత్రమే ఎక్కువగా తాగుతుందని యువకుడు ఆరోపణలు చేశాడు.

Read More: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

ఈ విషయంతెలిసీ యువతి బంధువులు విస్తుపోయారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు. ప్రస్తుతం ఇరు వర్గాలను పీఎస్ కు రప్పించి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం బుద్ధి రా నాయన అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News