7.7 తీవ్రతతో వణికించిన భారీ భుకంపం.. సునామి హెచ్చరికలు జారీ

ఇండోనేషియాను వణికించిన భారీ భుకంపం 

Last Updated : Sep 28, 2018, 10:20 PM IST
7.7 తీవ్రతతో వణికించిన భారీ భుకంపం.. సునామి హెచ్చరికలు జారీ

తరచుగా భూకంపాల భారిన పడుతున్న ఇండోనేషియాను శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6:02 గంటలకు పలు దశల్లో సంభవించిన ఈ భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతగా నమోదైంది. భారీ భూకంపాల అనంతరం సునామి ఎర్లీ వార్నింగ్ సిస్టం విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియాలోని సులవేసి దీవిలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఈ భూకంపం ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోగా భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. 
 

Trending News